News July 23, 2024
రైలు నుంచి జారిపడి నెల్లూరు వాసి మృతి

సూళ్లూరుపేట ఇసుకమిట్ట వద్ద రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు నెల్లూరుకు చెందిన ఏలూరు కుమార్గా గుర్తించారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఉంటాడని వారు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 17, 2025
బుచ్చిలో మహిళ ఆత్మహత్యాయత్నం

చీరతో ఫ్యాన్కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుచ్చిలోని చెన్నూర్ రోడ్డులో మంగళవారం జరిగింది. మహందాపురానికి చెందిన శ్రీను నెల్లూరుకు చెందిన భార్గవిని 2ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప ఉంది. ప్రస్తుతం ఆ మహిళ రెండు నెలల గర్భవతి. భర్తని హోటల్లో భోజనం తెమ్మని, భర్త వచ్చేలోపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త గమనించి రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించాడు.
News December 17, 2025
నెల్లూరు: మేము ‘సై’.. కానీ మా ప్రాణాలకు రక్షనుందా.!

గంజాయి నిర్మూలనకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. యువత సైతం ముందుకు రావాలని DSP ఘట్టమనేని కోరారు. నగదు ప్రోత్సాహాన్ని సైతం ఆఫర్ చేస్తున్నారు. గంజాయి సమాచారం ఇస్తాం.. మరి మా ప్రాణాలకు రక్షణ ఇవ్వగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారట. పెంచలయ్య హత్యను వారు ఉదహరిస్తున్నారు. గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ యువతి సైతం అనంతరం ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. మరి పోలీసులు యువతకు భరోసా ఇస్తారా.? చూడాలి.
News December 17, 2025
నెల్లూరు: మేము ‘సై’.. కానీ మా ప్రాణాలకు రక్షనుందా.!

గంజాయి నిర్మూలనకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. యువత సైతం ముందుకు రావాలని DSP ఘట్టమనేని కోరారు. నగదు ప్రోత్సాహాన్ని సైతం ఆఫర్ చేస్తున్నారు. గంజాయి సమాచారం ఇస్తాం.. మరి మా ప్రాణాలకు రక్షణ ఇవ్వగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారట. పెంచలయ్య హత్యను వారు ఉదహరిస్తున్నారు. గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ యువతి సైతం అనంతరం ఆందోళన చెందినట్లు తెలస్తోంది. మరి పోలీసులు యువతకు భరోసా ఇస్తారా.? చూడాలి.


