News April 1, 2025

రైలు నుంచి జారిపడి విశాఖ వాసి మృతి

image

విశాఖకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తుని GRP పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం కాకినాడ(D) గొల్లప్రోలు వద్ద జరిగింది. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ తన కుమార్తె పుట్టి వెంట్రుకలు తీయించేందుకు భార్యతో కలిసి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్తున్నాడు. చేయి కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వచ్చిన ఆయన కుదుపులకు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 18, 2025

నరసరావుపేట: డబ్బులు వసూలు చేసిన ఆసుపత్రులపై కలెక్టర్ ఆగ్రహం

image

NTR వైద్య సేవ కింద పేషెంట్లకు నగదు రహిత వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ డిసిప్లీనరీ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా, 40 ఫిర్యాదులను కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. కొన్ని ఆసుపత్రులు డబ్బులు వసూలు చేసి తిరిగి ఇచ్చేసినట్లు కమిటీ గుర్తించింది. ఈ విషయంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News November 18, 2025

HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

image

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్‌లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్‌లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT

News November 18, 2025

‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.