News May 11, 2024
రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నార్కట్పల్లి – చిట్యాల రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. నల్గొండ రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి.రజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడి వయసు 35-40సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 11, 2025
NLG: రూ.113.33 కోట్ల రైతు భరోసా జమ

జిల్లాలో రెండెకరాలలోపు భూమి ఉన్న 1,85,545 మంది రైతుల ఖాతాల్లో రూ.113,33,74,857 రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఇంతకు ముందు జనవరి 26న 31 మండలాల్లో ఎంపిక చేసిన 31 గ్రామాల రైతులకు 35,568 మంది రైతుల ఖాతాల్లో 46,93,19,160 జమ చేసింది. మిగతా రైతులకు దశలవారీగా డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
News February 11, 2025
నల్గొండ: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

నేరడిగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామ శివారులో విషాదం జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కేతావత్ చెన్నా పొలం దగ్గర ఓ వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోయాడు. అడవి పందుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగలడంతో ఈ విషాదం జరిగింది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 11, 2025
దామరచర్ల పీహెచ్సీని తనిఖీ చేసిన ఇలా త్రిపాఠి

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రికార్డులన్నింటినీ సక్రమంగా నిర్వహించాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె దామరచర్ల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వైద్యుల హాజరు రిజిస్టర్, మందుల రిజిస్టర్లను, అలాగే స్టాక్ తదితర రిజిస్టర్లు అన్నిటిని తనిఖీ చేశారు.