News June 14, 2024
రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన కింది రైళ్లను యధావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.* నం.07864 గుంటూరు- విజయవాడ* నం.07628 విజయవాడ- గుంటూరు* నం.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్* నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ
Similar News
News October 2, 2024
మైలవరం: మాజీ మంత్రి జోగి రమేశ్కు నోటీసులు
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి, మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ జోగి రమేశ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో నేడు హాజరుకావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు.
News October 2, 2024
కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీపీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News October 2, 2024
బీటెక్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో 2024- జనవరిలో జరిగిన బీటెక్ 1, 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రీవాల్యుయెషన్కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.