News August 21, 2024

రైల్వేకోడూరుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23న రైల్వేకోడూరు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గన్నవరం నుంచి ఆయన ఉదయం 9:05 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 9:10 గంటలకు మైసూర్ వారి పల్లి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మైసూరు వారి పల్లె సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా రాజంపేట మండలం పులపుత్తూరుకు మధ్యాహ్నం 12:45 గంటలకు చేరుకుని వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు.

Similar News

News September 30, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

News September 30, 2024

కడప జిల్లాలో పేలిన డిటోనేటర్.. కారణం?

image

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో <<14229836>>డిటోనేటర్ పేలి VRA మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మైనింగ్ కోసం ఉంచిన డిటోనేటర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News September 30, 2024

కడప జిల్లాలో బాంబు పేలుడు.. VRA మృతి

image

కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక VRA వి నరసింహులు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేయడంతో VRA మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.