News March 20, 2025
రైల్వేకోడూరు ఎమ్మెల్యే కాలుకు గాయం

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు మధ్య నిర్వహించిన క్రీడా పోటీల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు. బుధవారం కబడ్డీ ఆడుతూ ఆయన కింద పడిపోయారు. కిందపడిన ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో శ్రీధర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాలు ఫ్రాక్చర్ తీవ్రత గురించి తెలియాల్సి ఉంది.
Similar News
News November 16, 2025
చూద్దాం పదండి.. హైదరాబాద్ అందాలు

భాగ్యనగరం అంటే చార్మినార్, గోల్కొండ మాత్రమే కాదు. చరిత్ర సుగంధం వెదజల్లే అనేక అపూర్వ కట్టడాలకు ఆవాసమిది. సంస్కృతి, కళ, నిర్మాణ కౌశలాల సమ్మేళనం. శతాబ్దాల నాటి వారసత్వ సంపద నగరంలో ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాటి వెనుక కథలను వెలికితీసే ప్రయత్నమే ఇది. రోజూ ఓ చారిత్రక కట్టడం, ప్రముఖుల విశేషాలతో ‘హైదరాబాద్ అందాలు’ రానుంది. వారాంతాల్లో ఈ అందాలపై ఓ లుక్ వేయండి. <<18301143>>ఫలక్నుమా<<>>ప్యాలెస్ గురించి తెలుసుకుందాం.
News November 16, 2025
కామారెడ్డి: చికెన్, మటన్ ధరలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, ఉండగా చికెన్ స్కిన్ రూ.210 -220, స్కిన్ లెస్ రూ.230-240, లైవ్ కోడి రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారం ధరలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కార్తీక మాసం కావడంతో విక్రయాలు సాధారణంగా ఉన్నాయని దుకాణాలు తెలిపారు.
News November 16, 2025
గద్వాల్ స్టేషన్లో ఆగే రైళ్లు ఇవే..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. గద్వాల రైల్వే స్టేషన్లో 17022 వాస్కో- హైదరాబాద్ 12976 మైసూర్- జైపూర్ రైళ్లను నిలిపే ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. # SHARE IT


