News March 28, 2025
రైల్వేబోర్డు చైర్మన్ను కలిసిన ఖమ్మం ఎంపీ

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్- మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి వివరించారు. పలు సమస్యలు, సూచనలు తెలపగా రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం బస్టాండ్ వద్ద డ్రైనేజీలో మృతదేహం

ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని టూ టౌన్ పోలీసులు కోరారు.
News November 25, 2025
ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..!

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 25, 2025
19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 19మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి లభించింది. సీపీ సునీల్ దత్ మంగళవారం వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. వీరిలో నలుగురిని మహబూబాబాద్కు, 14 మందిని భద్రాద్రి కొత్తగూడెంకు, ఒకరిని ఇతర విభాగానికి కేటాయించారు.


