News April 5, 2025
రైల్వే కోడూరు: తల్లిదండ్రులపై కేసు నమోదు

రైల్వే కోడూరు పట్టణంలో బైక్ నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులో తీసుకుని వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ బాబు తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నూతన వాహన చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Similar News
News November 14, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలో ఇలా.!

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 48,406 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 47,533 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 13,564 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.
News November 14, 2025
గుంటూరులో ఉగ్రవాద లింకులు?

గుంటూరులో ఉగ్ర లింకులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నిఘావర్గాల సమాచారంతో ముంబైకి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు నిన్న ఉదయం నుంచి నగరంలో తనిఖీలు చేపడుతున్నట్లు పలు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. పట్టణంలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారని, పలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని గుంటూరు జిల్లా పోలీసు శాఖ పేర్కొంది.
News November 14, 2025
పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపు: చాహత్ బాజ్ పేయ్

భద్రకాళి చెరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్టులు అమలుతో పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, నగర సౌందర్యాన్ని మరింత పెంచుతాయని కుడా వైస్ ఛైర్పర్సన్ చాహత్ బాజ్ పేయ్ అన్నారు.భద్రకాళి ఆలయం నుంచి భద్రకాళి బండ్ వరకు ప్రతిపాదిత రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్ట్ అమలు కోసం పలు సంస్థల ప్రతినిధులు తమ ప్రెజెంటేషన్లు సమర్పించారు. ఈ ప్రజెంటేషన్లను వైస్ ఛైర్పర్సన్ సమీక్షించారు.


