News April 5, 2025

రైల్వే కోడూరు: తల్లిదండ్రులపై కేసు నమోదు

image

రైల్వే కోడూరు పట్టణంలో బైక్ నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులో తీసుకుని వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ బాబు తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నూతన వాహన చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

Similar News

News November 18, 2025

అమిత్ షా డెడ్‌లైన్‌కి ముందే హిడ్మా ఎన్‌కౌంటర్!

image

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్‌కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News November 18, 2025

అమిత్ షా డెడ్‌లైన్‌కి ముందే హిడ్మా ఎన్‌కౌంటర్!

image

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్‌కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News November 18, 2025

వనపర్తి: పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సు

image

ఈనెల 20న అమావాస్య సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి నుంచి మధ్యాహ్నం 12గం.కు బయలుదేరి సాయంత్రం పంచముఖి చేరుకొని అక్కడ దర్శన అనంతరం మంత్రాలయం చేరుకొని అక్కడ దర్శనం అనంతరం తిరిగి పంచముఖి చేరుకొని మధ్య రాత్రి బయలుదేరి 21న ఉదయం వనపర్తికి చేరుకుంటుందన్నారు. ఒకరికి రాను పోను రూ.600 ఛార్జీ ఉంటుందన్నారు.