News April 5, 2025

రైల్వే కోడూరు: తల్లిదండ్రులపై కేసు నమోదు

image

రైల్వే కోడూరు పట్టణంలో బైక్ నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులో తీసుకుని వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ బాబు తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నూతన వాహన చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

Similar News

News April 19, 2025

ASF: మల్లక్కను చంపిన శివ అరెస్ట్

image

భూపాలపల్లి జిల్లా ఆదివారంపేటకు చెందిన వృద్ధురాలి హత్య కేసులో కాగజ్‌నగర్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లక్క(67) కోడలు శ్రీలతకు SKZR మండలం బారేగూడకు చెందిన శివ(42)తో పరిచయమైంది. ఇద్దరు సహజీవనం చేశారు. శివ వేధింపులు తాళలేక ఆమె ఆదివారంపేటకు రాగా శివ కలవాలని చూశాడు. ఆమె నిరాకరించడంతో మల్లక్కను చంపితే కేసు శ్రీలత మీదకే వస్తుందని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు శివను అరెస్టు చేశారు.

News April 19, 2025

MNCL: పోలీసులను ఇబ్బంది పెట్టిన ముగ్గురి అరెస్ట్

image

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు రవి ఓ లాడ్జి ఎదుట బైక్‌పై ముగ్గురు వ్యక్తులు కూర్చొని న్యూసెన్స్ చేస్తుండగా వెళ్లి అడిగారు. డ్యూటీలో ఉన్నారని తెలిసి పోలీసులను తిట్టిన బానోత్ సాయి వికాస్, సిలారపు వినయ్‌, ఓ మైనర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 19, 2025

ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

image

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!