News April 5, 2025
రైల్వే కోడూరు: తల్లిదండ్రులపై కేసు నమోదు

రైల్వే కోడూరు పట్టణంలో బైక్ నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులో తీసుకుని వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ బాబు తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నూతన వాహన చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Similar News
News October 20, 2025
ఎస్పీ రోహిత్ రాజు దీపావళి విషెస్

జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ రోహిత్ రాజు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వెలుగుల మధ్య ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని కోరారు.
News October 20, 2025
KNR: బ్యాంకులో వింత పొకడలు.. దేనికి సంకేతం..?

డైరెక్టర్ల తొలగింపు, కేసులు, పార్టీల జోక్యంతో KNR కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అప్రతిష్టను మూటగట్టుకుంది. నిన్నటివరకు ఛైర్మన్గా ఉన్న విలాస్ రెడ్డి నామినేటెడ్ పోస్టులో ఛైర్మన్ అయ్యాడు. దీనికితోడు బ్యాంక్ ఎన్నికల్లో ప్యానెల్ ఏర్పాటుకు CONG, BJP, BRSల ప్లాన్లు వింత పోకడలను సూచిస్తోంది. బ్యాంకులో 9,287 మందికి సభ్యత్వం ఉంది. రేపట్నుంచి 23 వరకు నామినేషన్లు, NOV 1న పోలింగ్, 4లోపు పాలకమండలి కొలువుదీరనుంది.
News October 20, 2025
APPLY NOW: 36 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ముంబైలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ (SAMEER) 36 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ను బట్టి టెన్త్, ITI, NVCT/NAC, డిప్లొమా, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు OCT 31వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష,స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు రూ.100. వెబ్సైట్:sameer.gov.in/