News January 21, 2025
రైల్వే ట్రాక్పై సిద్దిపేట జిల్లా అమ్మాయి తల, మొండెం (UPDATE)

జామై ఉస్మానియాలో ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 19, 2025
చరిత్ర సృష్టించి 11 ఏళ్లైంది: హరీశ్రావు

స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏళ్ల క్రితం నవ చరిత్రకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజది. దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మంగళవారం ట్వీట్ చేశారు.
News February 19, 2025
మెదక్: యూనివర్సిటీ కోసం భూమి పరిశీలించిన కలెక్టర్

మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమిని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం పాపన్న పేట మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమికి సంబంధించి వివిధ ప్రదేశాలను సంబంధిత ఆర్డీవో రమాదేవి, ఇన్ ఛార్జ్ తహశీల్దార్ మహేందర్ గౌడ్తో కలిసి పరిశీలించారు.
News February 18, 2025
MDK: వేతనాలు విడుదల చేయాలని మంత్రికి వినతి

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న బ్లడ్ బ్యాంక్, ఐసీయూ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు విడుదల చేయాలని మంత్రి దామోదర్కు ఆ ఉద్యోగ సంఘం నాయకులు శివకుమార్ వినతి పత్రం అందజేశారు. గత 6 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి విన్నవించారు. దీంతో మంత్రి స్పందించి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అధికారికి వివరణ కోరగా వేతనాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.