News February 12, 2026

రైల్వే శాఖ మంత్రిని కలిసిన కడప ఎంపీ

image

ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌‌ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కమలాపురం స్టేషన్‌లో చెన్నై – ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో స్టాపింగ్ కోసం లేఖ ఇచ్చారు. అలాగే జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.

Similar News

News March 10, 2026

కడప జిల్లాలోని మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

image

కడప కార్పొరేషన్ సహా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. వీటికి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో 284 జారీ చేసింది. కడపకు కలెక్టర్, ప్రొద్దుటూరుకు జాయింట్ కలెక్టర్, మిగతా ఐదు పట్టణాలకు ఆర్డీవోలు స్పెషల్ ఆఫీసర్లుగా ఆరు నెలల పాటు విధుల్లో ఉండనున్నారు.

News March 10, 2026

కడప: ఇంటర్ పిజిక్స్ పరీక్షలకు 13,755 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో మంగళవారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ పిజిక్స్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 13,755(96%) మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 13,131 మందికి గాను.. 12,741 మంది హాజరయ్యారు. 390 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,210 మందికి గాను.. 1,014 మంది పరీక్షలు రాశారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

News March 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,950
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,674
*వెండి 10 గ్రాముల ధర రూ.2,750