News December 16, 2024

 రైల్వే సమస్యలను పరిష్కరించాలి: తిరుపతి ఎంపీ

image

పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట-గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం కూడా అత్యవసరమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై భారం తగ్గించి, ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ కొత్త లైన్ ఎంతో అవసరమనే విషయాన్ని వివరించారు. అలాగే పూడి, ఏర్పేడు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు.

Similar News

News November 28, 2025

చిత్తూరు: ‘జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలి’

image

అర్హులైన పేదలకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను చేరువచేసి, వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. చిత్తూరు కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ZP సీఈవో రవికుమార్ ఉన్నారు.

News November 28, 2025

చిత్తూరు: సివిల్స్ ఎగ్జామ్‌కు ఫ్రీ ట్రైనింగ్

image

యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News November 28, 2025

BLOల నియామకానికి ప్రతిపాదనలు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోల నియామకానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. బీఎల్ఓలందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు.