News March 4, 2025
రైళ్ల ద్వారా పెనుకొండ కియా కార్ల ఎగుమతి

పెనుకొండలోని కియా ఇండియా ప్లాంట్లో తయారైన కార్లు రైలు ద్వారా ఎగుమతి అవుతున్నాయి. మంగళవారం ఆ సంస్థ సెల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ జెండా ఊపి రైలును ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా డబుల్ డెక్కర్ రైలులో కార్లను మార్కెటింగ్ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రైల్వే ద్వారా 60 వేల కార్లను ఎగుమతి చేశామన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News October 25, 2025
ద్రాక్షారామ ఆలయ ఆవరణలో వ్యక్తి మృతి

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం దొంగ భీమన్న అనే కార్మికుడు గడ్డి మిషన్తో గడ్డి కోస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆలయ సిబ్బంది వెంటనే ద్రాక్షారామ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఎం. లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
News October 25, 2025
HYD: ఉస్మానియా ఆసుపత్రిలో టెలీ కమ్యూనికేషన్ సేవలు..!

ఉస్మానియా ఆసుపత్రి వేదికగా టెలీ కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం 80 నుంచి 100 మంది వరకు ఇది వినియోగించుకుంటున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ప్రాథమిక వైద్య సేవల మినహా, ఏవైనా స్పెషాలిటీ అవసరమైతే, టెలీ సేవలను అందిస్తున్నారు. మధుమేహ, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు తదితర సేవలు అందిస్తున్నారు.
News October 25, 2025
HYD: ఉస్మానియా ఆసుపత్రిలో టెలీ కమ్యూనికేషన్ సేవలు..!

ఉస్మానియా ఆసుపత్రి వేదికగా టెలీ కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం 80 నుంచి 100 మంది వరకు ఇది వినియోగించుకుంటున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ప్రాథమిక వైద్య సేవల మినహా, ఏవైనా స్పెషాలిటీ అవసరమైతే, టెలీ సేవలను అందిస్తున్నారు. మధుమేహ, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు తదితర సేవలు అందిస్తున్నారు.


