News March 26, 2025

రొంపిచర్ల : విద్యార్థుల నమోదు కోసం పోటా పోటీ ప్రచారం

image

విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించండంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్లు రొంపిచర్ల మండలంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. 6 తరగతిలో పిల్లలను నమోదు చేసుకునేందుకు 5 తరగతి చదువుతున్న పిల్లలను కలిసి ప్రభుత్వ స్కూల్లో చేరమని కోరుతున్నారు. మరోపక్క ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు కూడా ప్రచారం ముమ్మరం చేస్తూ ఇంటింటికి వెళ్లి పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను టీచర్లు అభ్యర్థిస్తున్నారు.

Similar News

News April 1, 2025

వి.కోట : రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి 

image

వి.కోట – పలమనేరు ప్రధాన రహదారిలో రాఘవపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి చెందాడు. అతను రామకుప్పం మండలం కంచిదాసనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గురుమూర్తిగా సమాచారం. మంగళవారం ఉదయం రాగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. స్థానికులు వి.కోట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

News April 1, 2025

చిత్తూరు: నేడు తెరచుకోనున్న బడులు

image

చిత్తూరు జిల్లాలో నిర్ణయించుకున్న స్థానిక ఐచ్చిక సెలవులు పూర్తిగా వాడుకున్నారని డీఈవో వరలక్ష్మి తెలిపారు. దీంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఎలాంటి సెలవు లేదన్నారు. బడులు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పక విధులకు హాజరు కావాలన్నారు. అలాగే టెన్త్ పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.

News April 1, 2025

నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పెన్షన్లు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,65,067 మంది పెన్షన్ దారులకు రూ.112.79 కోట్లు పెన్షన్లు పంపిణీ చేయునట్లు తెలిపారు.

error: Content is protected !!