News October 10, 2024

రోకలి బండతో మోది భర్తను చంపిన భార్య

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ధర్మపురిలో దేవరకొండ గోవింద్(60) అనే వ్యక్తిని భార్య అంజమ్మ ఇంటిలో రోకలిబండతో తలపై మోది చంపింది. మద్యం తాగి వచ్చి తరచూ అంజమ్మను తిడుతూ వేధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన అంజమ్మ.. భర్తను రోకలి బండతో కొట్టి చంపింది. ధర్మవరం రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Similar News

News October 11, 2024

దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: కలెక్టర్

image

చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్కరి కుటుంబానికి విజయాలు వరించాలన్నారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలను మంత్రి తెలిపారు.

News October 10, 2024

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

కనగాణపల్లి మండలంలోని కేజీబీవి బాలికల పాఠశాలలో ఖాళీగా బోధనేతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. పాఠశాలలో హెడ్ కుక్ పోస్టు 1, అసిస్టెంట్ కుక్ 1, చౌకిదర్ పోస్టు 1 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.

News October 10, 2024

మైనర్లను పనిలో ఉంచుకోవడం నేరం: ఎస్పీ

image

మైనర్ పిల్లలను పనులలో ఉంచుకోవడం నేరమని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన పుట్టపర్తితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు మోటార్ మెకానిక్ షాపులు, గుజిరి, కిరాణా షాపులను తనిఖీ చేశారు. 14 ఏళ్ల లోపు పిల్లలను దుకాణాలలో పనికి పెట్టుకోరాదని, వారి హక్కులకు భంగం కలిగించుట నేరమని తెలిపారు.