News May 26, 2024
రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన గాంధీ డాక్టర్!
సర్జరీ చేసేందుకు గాంధీ ఆస్పత్రి డాక్టర్ పేషెంట్ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనారోగ్యంతో గాంధీలో చేరాడు. సర్జరీ చేయడానికి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ వైద్యాధికారి రూ.10 వేలు డిమాండ్ చేశారని, దాంతో తాము Gpay ద్వారా చెల్లించినట్లు పేషెంట్ భార్య గోవిందమ్మ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు HODలతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
Similar News
News September 21, 2024
HYD: ఫుట్ పాత్పై వ్యాపారం చేస్తే.. అంతే సంగతి!
HYD నగరంలో అనేక చోట్ల చిరు వ్యాపారులు ఫుట్ పాత్పై వ్యాపారం చేస్తున్నారు. వారందరికీ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ వ్యాపార సముదాయాలను అధికారులు తొలగించారు. వాటిలో పండ్ల దుకాణాలు, నర్సరీలు, గృహోపకర వస్తువుల దుకాణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఫుట్ పాత్పై వ్యాపారం చేయొద్దని సూచించారు.
News September 21, 2024
HYD: నాలుగేళ్లలో 50 వేల మందికి SKILL ట్రైనింగ్
వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని HYD నగరంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. 2024-25 తొలి త్రైమాసికంలో జాతీయ ఐటీ ఎగుమతులు 3.3% పెరిగాయని, అదే సమయంలో రాష్ట్రంలో 11.3% వృద్ధి నమోదు అయినట్లుగా పేర్కొన్నారు.
News September 21, 2024
HYD: నేపాల్ వాళ్లకు సైతం ఇక్కడే ట్రైనింగ్!
రాజేంద్రనగర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో IPS అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రోగ్రాంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్ హోం అఫైర్స్ కేంద్రమంత్రి నిత్యానందతో పాల్గొన్నారు. తామిద్దరం 16వ లోక్ సభలో సహచరులుగా ఉండటం ఇదే మొదటిసారి అని తెలిపారు. నేపాల్, భూటాన్ ప్రాంతానికి చెందిన వారు సైతం ఇక్కడే ట్రైనింగ్ పొందినట్లు ఎంపీ పేర్కొన్నారు.