News March 5, 2025

రోగులకు మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

image

మణుగూరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మణుగూరు ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో కలియ తిరుగుతూ జనరల్ వార్డు, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, స్కానింగ్, డయాలసిస్ యూనిట్ లను పరిశీలించి రోగులతో మాట్లాడారు.

Similar News

News November 24, 2025

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బ్రాహ్మణుల నిరసన

image

బ్రాహ్మణులను కించపరిచేలా పాట పాడిన జీడీ నరసయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. జీడి నరసయ్యపై వెంటనే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా చూడాలని కోరారు.

News November 24, 2025

ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

image

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్‌కు లింక్ అయ్యేలా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్‌మీట్‌లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

News November 24, 2025

జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు పాడేరు విద్యార్థి ఎంపిక

image

పాడేరు శ్రీ మోదమాంబ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థి సీహెచ్ మోహిత్ సాయి రాష్ట్ర సబ్‌జూనియర్ విలువిద్య పోటీల్లో రెండో స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న విద్యార్థికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సోమవారం ఆర్థిక సహాయం అందించి అభినందనలు తెలిపారు. క్రీడా అధికారి జగన్మోహన్ రావు, కోచ్ సుధాకర్ నాయుడు ఉన్నారు.