News March 5, 2025
రోగులకు మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

మణుగూరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మణుగూరు ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో కలియ తిరుగుతూ జనరల్ వార్డు, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, స్కానింగ్, డయాలసిస్ యూనిట్ లను పరిశీలించి రోగులతో మాట్లాడారు.
Similar News
News January 3, 2026
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్

విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం నంద్యాలలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ను కలెక్టర్ సందర్శించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ను స్వయంగా పరిశీలించి పాఠ్యాంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు.
News January 3, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 10 గ్రాము ధర: రూ.1,38,350
* బంగారం 22 క్యారెట్ల 10 గ్రాము ధర: రూ.1,27,280
* వెండి 10 గ్రాముల ధర: రూ.2,380.
News January 3, 2026
కేసీఆర్ వదిలిన రాజకీయ బాణం కవిత: కోమటిరెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న నేతలను దూరం చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కవిత అసలు బీఆర్ఎస్లో ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై విమర్శలకే స్పందిస్తున్న ఆమె.. హరీశ్రావుపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మంత్రి ప్రశ్నించారు.


