News April 9, 2026
రోజూ ఒకే టైమ్లో తింటే?

రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే జీవక్రియ మెరుగవుతుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా ఇది పాటిస్తే 90 రోజుల తర్వాత దీని రిజల్ట్ కనిపిస్తుందని చెబుతున్నారు. దీంతో డైజెషన్ మెరుగై శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయని అంటున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గి, ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుందని, శరీరం ఓ క్రమపద్ధతికి అలవాటు పడటం వల్ల యాక్టివ్గా పనిచేస్తుందని చెబుతున్నారు.
Similar News
News April 14, 2026
కీర దోసతో ఎన్ని లాభాలంటే..?

ఎండాకాలంలో చెమట రూపంలో కోల్పోయిన నీటిని, శక్తిని తిరిగి పొందడానికి కీర దోస ఉపయోగపడుతుంది. అందులోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను, శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కీర దోస చాలా మంచిది. రోజూ తినడం వల్ల టాక్సిన్స్ తొలగిపోతాయి.
News April 14, 2026
గుడ్న్యూస్ చెప్పిన LIC

ప్రభుత్వ బీమా సంస్థ LIC తమ ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్ చెప్పింది. 1:1 నిష్పత్తిలో బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపింది. రికార్డు తేదీ నాటికి వాటాదారులు కలిగి ఉన్న ప్రతి షేరుకు అదనంగా ఉచిత షేరును ఇవ్వనుంది. అంటే మీ వద్ద 100 షేర్లు ఉంటే బోనస్ తర్వాత అవి 200 షేర్లు అవుతాయి. రికార్డ్ డేట్ను త్వరలో ప్రకటించనుంది. 2022 మే నెలలో స్టాక్ మార్కెట్లో LIC లిస్ట్ అయింది.
News April 14, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


