News February 9, 2025

రోడ్డుప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

image

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.

Similar News

News March 26, 2025

ప.గో: వైసీపీకి షాక్ తప్పదా..?

image

ప.గో జిల్లాలో వైసీపీకి షాక్ ఇవ్వడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. యలమంచిలో 18 ఎంపీటీసీలకు గాను వైసీపీ 13, జనసేన 1, టీడీపీ 3 చోట్ల గెలిచింది. ఓ సీటు ఖాళీగా ఉంది. అత్తిలిలో టీడీపీకి 5, వైసీపీకి 15 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఆ రెండు చోట్లు ఐదారు మందిని కూటమిలోకి లాగి ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడానికి NDA నాయకులు పావులు కదుపుతున్నారు.

News March 26, 2025

ప.గో: ఆ గ్రామాలను దత్తత తీసుకోనున్న పవన్..!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించి ఆర్జీలను స్వీకరించాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఈ సభలకి హాజరయ్యి ఆయా గ్రామాలకు కావల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి అర్జీలు స్వీకరిచి వాటిపై దృష్టిపెడతారు.

News March 25, 2025

‘గూడెం’ బార్ అసోసియేషన్ ఎన్నికల నగారా

image

తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్‌లో ఎన్నికల నగారా మోగింది. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో నామినేషన్ స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మంగళవారం తెలిపారు. 26న సాయంత్రం స్క్రూట్నీ, 27న ఉపసంహరణ, 29న ఎన్నికలు జరుగుతాయన్నారు.

error: Content is protected !!