News January 6, 2025

రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా వాసులు స్పాట్‌డెడ్

image

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన ఇద్దరు మహిళలు సోమవారం చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న భక్తుల బృందాన్ని, మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తున్న 108 వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురుకి గాయాలయ్యాయి.

Similar News

News December 8, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు:

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☞ బంగారం 24 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.12775
☞ బంగారం 22 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.11753
☞వెండి 10 గ్రాముల ధర: రూ.1780

News December 8, 2025

కడపకు చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కడపకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు SP నచికేత్ విశ్వనాథ్ స్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆమె జిల్లాకు వచ్చినట్లు సమాచారం.

News December 8, 2025

రాయచోటిలో ప్రాణం తీసిన కుక్కలు

image

రాయచోటిలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఓ వ్యక్తి బైకుపై వస్తుండగా కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో కుక్కలు వెంటపడ్డాయి. ఈక్రమంలో అతను అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడు పజిల్(42)గా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.