News January 6, 2025
రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా వాసులు స్పాట్డెడ్
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన ఇద్దరు మహిళలు సోమవారం చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న భక్తుల బృందాన్ని, మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తున్న 108 వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురుకి గాయాలయ్యాయి.
Similar News
News January 26, 2025
కడప: బస్సులో పొగలు.. ఆగిన బస్సు
తిరుపతి నుంచి ఆదోని వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వల్లూరు సమీపంలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు వెనుక వైపున పొగ రావడం గమనించిన ప్రయాణికులు డ్రైవర్కు తెలిపారు. టెక్నికల్ సమస్యతో బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే బస్సులో ఎక్కించి పంపించారు. దూర ప్రయాణాలు చేసే బస్సుల కండిషన్ సరిగా లేకపోవడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
News January 26, 2025
చెక్ పోస్టుల్లో కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించాలి: ఎస్పీ
కడప జిల్లాలోని అన్ని చెక్ పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యం, నిషేదిత పదార్థాలు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి దువ్వూరు పీఎస్ పరిధిలోని ఇడమడక అంతర్ జిల్లా చెక్ పోస్ట్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News January 25, 2025
YS వివేకా ఘటనపై స్పందించిన విజయసాయిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యపై విజయసాయిరెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని, వెంటనే అవినాశ్ రెడ్డికి ఫోన్ చేయగా పక్కన ఉన్న వ్యక్తికి ఫోన్ ఇచ్చారన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారని, ఫోన్లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.