News February 3, 2025

రోడ్డు ప్రమాదంలో అల్లూరి వాసి మృతి

image

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం కుక్కునూరు మండలం నెమలిపేటలో సోమవారం సాయంత్రం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వేలేరుపాడు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా లోప ఐతమ్ రాజుల శ్రీనివాస్ మృతి చెందాడు.

Similar News

News November 20, 2025

ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్‌గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.

News November 20, 2025

ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్‌గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.

News November 20, 2025

హిడ్మా అనుచరుడికి 14 రోజుల రిమాండ్: రావులపాలెం CI

image

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్‌ను రావులపాలెంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు. సరోజ్.. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత వచ్చారా? లేక ముందే ఇక్కడ తలదాచుకున్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సరోజ్‌ను కొత్తపేట కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అతడిని RJY జైలుకు తరలించారు.