News February 27, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

image

రొద్దం మండల సమీపంలోని దొమ్మత మర్రివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో రెడ్డి పల్లి నుంచి లేపాక్షికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా తిరుమలేశ్, భరత్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 17, 2025

హనుమాన్ చాలీసా భావం – 12

image

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 17, 2025

హనుమాన్ చాలీసా భావం – 12

image

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 17, 2025

వర్కింగ్ ఉమెన్ విజయం సాధించాలంటే..

image

ఉద్యోగం చేసే ప్రతి మహిళా ఉన్నత స్థానానికి ఎదగాలనే కోరుకుంటుంది. దీనికోసం పనులను వేగంగా, సంపూర్ణంగా చేయడం నేర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఇంటాబయటా ఉత్సాహంగా అన్ని పనులూ చేయగలరు. కాబట్టి రోజూ కనీసం ఓ గంట వ్యాయామం, యోగాకి కేటాయించాలి. రేపు చేయాల్సిన పనుల జాబితాను ముందే రాసుకుంటే ఏం చేయాలనేదానిపై స్పష్టత వస్తుంది. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆఫీసుకు వచ్చాక కేవలం పని మీదే దృష్టి సారించాలి.