News June 24, 2024

రోడ్డు ప్రమాదంలో కనిగిరి వ్యక్తి మృతి

image

కనిగిరికి చెందిన రసూల్‌ (32) అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్‌ శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రసూల్ కొన్నేళ్ల క్రితం చుక్కాపూర్‌ అనే గ్రామానికి వలసవెళ్లాడు. ఆదివారం సాయంత్రం నడుచుకుంటూ ఘన్‌పూర్‌ గ్రామం వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో మరణించాడు.

Similar News

News November 13, 2025

మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

image

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News November 13, 2025

ప్రకాశం జిల్లాలో 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో బుధవారం వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థుల్లో గ్రంథాలయాల ప్రాముఖ్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

News November 12, 2025

జిల్లాలో 7372 ఇళ్ల నిర్మాణం పూర్తి: ప్రకాశం కలెక్టర్

image

జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 7372 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని కలెక్టర్ రాజా బాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణాలకు సంబంధించి బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గృహాల నిర్మాణం ద్వారా రూ. 17.77 కోట్ల ఆర్థిక ప్రయోజనం లబ్ధిదారులకు మేలు జరిగిందన్నారు. వివిధ నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న 11,443 మందికి రూ.18.36 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించిందని తెలిపారు.