News February 9, 2025

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి..తల్లికి సీరియస్

image

ఆకివీడు శివారు దుంపగడప వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కలిదిండి మండలం చినతడినాడకు చెందిన కొల్లాటి వెంకట యువరాజు (28) మృతి చెందాడు. మృతుడు తల్లితో కలిసి ఆకివీడులో జరుగుతున్న క్రైస్తవ మహాసభలకు హాజరై బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా కైకలూరు-ఆకివీడు వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువరాజు మృతి చెందాడు. అతని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 15, 2025

VZM: ఇంకా ఒక్కరోజే టైం.. ALL THE BEST

image

పదో తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 23,765 మంది విద్యార్థులు 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 1150 మంది ఇన్విజిలేటర్లు, 9మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్లు, 238 మంది డిపార్టమెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష జరగనుండగా.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు.
ALL THE BEST

News March 15, 2025

నిద్రలేమితో అనారోగ్యమే!

image

మనిషికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక నిద్రలేమికి సంకేతమని చెబుతున్నారు. నిద్రలేమితో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సరైన నిద్ర ఉంటే 30-60% రోగుల్లో ఆల్జీమర్స్, గుండె జబ్బులు తగ్గుతున్నాయని తెలిపారు. ఏకధాటిగా 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.

News March 15, 2025

ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

image

నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

error: Content is protected !!