News February 17, 2025

రోడ్డు ప్రమాదంలో గాజువాక యువకుడి మృతి

image

గాజువాకకు చెందిన కర్రీ సాయికిరణ్(17) పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి బండరాయిను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. G.మాడుగుల(M) గుదలం వీధి మలుపు వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో పోలీసుల సహాయంతోనే పాడేరు తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకొస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. సాయి కిరణ్ మృతితో చైతన్య నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News April 17, 2026

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం

image

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులోని మంగవారిపేట జంక్షన్ వద్ద గురువారం ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. నగర పర్యాటనకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డారు. సీసీ కెమెరా స్తంభాన్ని కూడా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బీచ్ పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.

News April 17, 2026

విశాఖలో మురుగునీటి శుద్ధికి ₹500 కోట్లు

image

విశాఖ గ్రేటర్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అనుసంధానానికి ₹500 కోట్లు వ్యయం చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 25% నిధులు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 75% నిధులు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

News April 17, 2026

విశాఖలో మురుగునీటి శుద్ధికి ₹500 కోట్లు

image

విశాఖ గ్రేటర్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అనుసంధానానికి ₹500 కోట్లు వ్యయం చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 25% నిధులు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 75% నిధులు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.