News February 14, 2025
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి మృతి

పల్నాడు జిల్లా శావల్యాపురంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుడు పెద్దారవీడుకు చెందిన రమణగా గుర్తించారు. గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాకు వస్తుండగా.. శావల్యాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 18, 2025
16 లక్షలకు పైగా ఉద్యోగాలు: నూకసాని

విశాఖలో జరిగిన సీఐఐ గ్లోబల్ సమ్మిట్ ఏపీ అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘విశాఖ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 613 ఒప్పందాల ద్వారా 16 లక్షలపైగా ఉద్యోగాలు యువతకు లభిస్తాయి’ అని చెప్పారు.
News November 18, 2025
16 లక్షలకు పైగా ఉద్యోగాలు: నూకసాని

విశాఖలో జరిగిన సీఐఐ గ్లోబల్ సమ్మిట్ ఏపీ అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘విశాఖ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 613 ఒప్పందాల ద్వారా 16 లక్షలపైగా ఉద్యోగాలు యువతకు లభిస్తాయి’ అని చెప్పారు.
News November 18, 2025
ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.


