News June 11, 2024
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం

బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కలువాయి మండలానికి చెందిన డిస్కం ఏఈ యశ్వంత్(26) మృతి చెందాడు. స్థానికులు వివరాల ప్రకారం.. యశ్వంత్ రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇతని కుటుంబ సభ్యులు నెల్లూరులో నివాసముంటున్నారు.
Similar News
News November 23, 2025
కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

కావలి జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించగలరు.
News November 23, 2025
నెల్లూరు: కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.
News November 23, 2025
అక్రమ లేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు గడువు పెంపు

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమలేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు NMC అధికారులు మరోసారి అవకాశం కల్పించారు. BPS పథకంలో భాగంగా 1985 నుంచి 2025 ఆగస్టు వరకు అనధికారికంగా, అనుమతికి మించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించేందుకు వచ్చే ఏడాది మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1113, 7981651881 నంబర్లను సంప్రదించాలని కమిషనర్ నందన్ కోరారు.


