News July 5, 2024

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి ప్రాణదానం

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకొచ్చారు. మంగళగిరికి చెందిన న్యాయవాది ప్రసాద్‌కు 2రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరగగా NRI ఆసుపత్రికి తరలించారు. కాగా వైద్యులు ప్రసాద్‌కు బ్రెయిన్ డెడ్‌గా నిర్థారించారు. అతని అవయువాలను శుక్రవారం మధ్యాహ్నం NRI నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తిరుపతికి తరలించనున్నారు.

Similar News

News December 6, 2025

GNT: వైసీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా సిరిబోయిన

image

వైసీపీ బీసీ సెల్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా సిరిబోయిన అవినాశ్ నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం అదిష్ఠానం తనను ఉపాధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా తనకు పదవి రావడానికి కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.

News December 6, 2025

GNT: మంత్రి నారా లోకేశ్‌పై అంబటి ట్వీట్

image

మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘X’లో సెటైరికల్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మంత్రి లోకేశ్ చంద్రబాబు ప్లేటును తీస్తున్న ఓ ఫొటో షేర్ చేసి, ఇప్పుడు నువ్వు “తిన్న ప్లేటు” రేపు నువ్వు “కూర్చున్న సీటు” తీసేయడం కాయం.! అంటూ క్యాప్షన్ ఇచ్చి చంద్రబాబు, లోకేశ్‌లకు ట్యాగ్ చేశారు.

News December 6, 2025

నేడు అంబేడ్కర్ వర్థంతి.. నారా లోకేశ్ ట్వీట్

image

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేశ్ ‘X’ లో పోస్ట్ చేశారు. ‘దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం కృషిచేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పరితపించారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం’ అంటూ రాసుకొచ్చారు.