News August 1, 2024
రోడ్డు ప్రమాదంలో విజయనగరం వాసులు

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. షిరిడి నుంచి మైలవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా వాసులుగా సమాచారం. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 23, 2025
సివిల్ రైట్స్ డేకి డీవీఎంసీ సభ్యులందరినీ ఆహ్వానించాలి: VZM కలెక్టర్

ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినం (సివిల్ రైట్స్ డే)కు డీవీఎంసీ సభ్యులందరినీ ఆహ్వానించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రతి మండలంలో ఎస్హెచ్వో, తహశీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలన్నారు.
News December 23, 2025
VZM: పది పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి

పది పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 297 పాఠశాలల్లో 16,240 మంది విద్యార్థులు 10 పరీక్షలకు హాజరవుతారని, వారందరూ ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపాలన్నారు.
News December 23, 2025
VZM: పది పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి

పది పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 297 పాఠశాలల్లో 16,240 మంది విద్యార్థులు 10 పరీక్షలకు హాజరవుతారని, వారందరూ ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపాలన్నారు.


