News March 23, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు: SI సంతోషి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన నర్సిపురం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. SI సంతోషి వివరాల మేరకు.. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామానికి చెందిన శంకరరావు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న రెండు ద్వి చక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో శంకర్రావు తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం నిమిత్తం KGHకు తరలించారని ఎస్ఐ సంతోషి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News November 6, 2025
TG SETకు దరఖాస్తు చేశారా?

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్షిప్కు అర్హత సాధించే <
News November 6, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.
News November 6, 2025
HYD: మీర్జాగూడ యాక్సిడెంట్.. యువకుడి మెసేజ్ వైరల్!

ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘రూల్స్ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తాయి. మన ప్రాణాలు కాపాడేవి అవే. త్వరగా వెళ్లాలంటే ముందు జాగ్రత్తగా వెళ్లాలి. మీ ఇంటికెళ్తూ వేరే ఇళ్లల్లో కన్నీళ్లు మిగిల్చకండి’ అంటూ మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఇలా ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. మీర్జాగూడ ఘటన నేపథ్యంలో యువకుడు ఇచ్చిన మెసేజ్ వైరలవుతోంది.


