News April 15, 2024
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్కు తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడిన ఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రామసముద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సొంత పనిమీద పుంగనూరుకు బైకులో వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గమధ్యంలోని కుదురుచీమనపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి బాధితుల్ని 108లో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 10, 2024
14న చిత్తూరు RR గార్డెన్లో లాటరీ సిస్టం
నూతన మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈనెల 14న నిర్వహిస్తామని అర్బన్ ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి వెల్లడించారు. ఈనెల 11న షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో జరగాల్సిన టెండర్ ప్రక్రియను మార్పు చేసినట్లు చెప్పారు. టెండర్దారులు 14వ తేదీ సంతపేట RR గార్డెన్లో ఉదయం 8 గంటలకు జరిగే లాటరీ ప్రక్రియకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
News October 9, 2024
మదనపల్లె జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 9, 2024
చిత్తూరు నూతన DFOగా భరణి
చిత్తూరు జిల్లా నూతన అటవీశాఖ అధికారిణిగా భరణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేస్తున్న చైతన్య కుమార్ రెడ్డిని ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన భరణి నూతన డీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో అటవీశాఖ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.