News September 27, 2024
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News November 18, 2025
నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్పీ ఫీల్డ్ అసిస్టెంట్తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
News November 18, 2025
నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్పీ ఫీల్డ్ అసిస్టెంట్తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
News November 17, 2025
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.


