News February 21, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్ 

image

విజ‌య‌వాడ‌ను ట్రాఫిక్ ప‌రంగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డంలో అధికారులు కృషిచేయాల‌ని కలెక్ట‌ర్ ల‌క్ష్మీశ, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర్ బాబు అన్నారు. గురువారం విజయవాడ క‌లెక్ట‌రేట్లో జ‌రిగిన ర‌హ‌దారి భ‌ద్ర‌త క‌మిటీ సమావేశంలో వారు మాట్లాడారు. స్వ‌చ్ఛంధ సంస్థ‌ల అధ్య‌య‌న నివేదిక‌లను క్షుణ్నంగా అధ్య‌య‌నం చేసి ప్ర‌మాదాలు జరగకుండా ప‌టిష్ఠ కార్యాచ‌ర‌ణ అవ‌స‌ర‌మన్నారు. 

Similar News

News November 22, 2025

బిచ్కంద: రోడ్డుపై వడ్లు.. ఒకరి ప్రాణం తీసింది!

image

వడ్ల కుప్ప కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. బిచ్కుంద SI మోహన్ రెడ్డి వివరాలిలా..లచ్చన్ వాసి కీర్తి రాజ్ (35) బరంగ్ ఎడిగి నుంచి బిచ్కుంద వైపు తన బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఖత్గావ్ చౌరస్తా సమీపంలో ఆరబోసిన వరి ధాన్యం కుప్పను కీర్తి రాజ్ బైక్‌తో ఎక్కించి, అదుపు తప్పి రోడ్డుపై పడి, అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరించారు.

News November 22, 2025

యాషెస్ టెస్టు.. 847 బంతుల్లోనే ముగిసింది

image

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 1895లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ 911 బంతుల్లో ముగిసింది. అటు తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు 405 బంతులే(67.3 ఓవర్లు) ఎదుర్కొన్నారు. 1904 తర్వాత ఇంత తక్కువ ఓవర్లలో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులను ముగించడం ఇదే తొలిసారి.

News November 22, 2025

‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.