News March 2, 2025
రోడ్డు ప్రమాద ఘటనపై బస్సు డ్రైవర్పై కేసు నమోదు

కదిరి పరిధిలోని కుటాగుళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రొద్దుటూరు డిపో ఆర్టీసీ ఇంద్ర బస్సు డ్రైవర్ బాషాపై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఏఎస్ దాదా పీర్ తండ్రి ఏఎస్ ముబారక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 28, 2025
అమ్రాబాద్ మండలంలో 14.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. అమ్రాబాద్ మండలంలో 14.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కల్వకుర్తి మండలం తోటపల్లిలో 14.5, వెల్దండ 14.6, బిజినపల్లి 14.8, తెలకపల్లి 14.9, తాడూరులో 15.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఉదయం వేళలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News November 28, 2025
NLG: సర్పంచ్ ఎన్నికల్లో తొలిసారి నోటా!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ తొలిసారి ఓటర్లకు ‘నన్ ఆఫ్ ద అబౌ(నోటా)’ అవకాశాన్ని కల్పించారు. బ్యాలెట్ పత్రంపై అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తును కూడా ముద్రిస్తున్నారు. ఉమ్మడి NLG జిల్లాలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేసేందుకు సిద్ధంగా లేకపోతే ఓటరు నోటాకు వేయొచ్చు.
News November 28, 2025
కామారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బీబీపేట 12.1°C, గాంధారి 13.6, లచ్చపేట 13.7, బొమ్మన్ దేవిపల్లి 13.8, నస్రుల్లాబాద్ 13.9, రామలక్ష్మణపల్లి 14, జుక్కల్ 14.1, డోంగ్లి,సర్వాపూర్ 14.2, నాగిరెడ్డిపేట 14.3, బీర్కూర్,బిచ్కుంద,మేనూర్ 14.5, పుల్కల్ 14.6, రామారెడ్డి 14.8, మాచాపూర్,దోమకొండ 14.9°C.


