News April 2, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ప్రమాద బాధితులకు బుధవారం లక్ష రూపాయలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్లో తీవ్ర గాయాలపాలైన మొండెం రామక్రిష్ణ, జన సన్యాసప్పాడుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 32 మందికి రూ.26,50,000 ఇచ్చినట్లు తెలిపారు.
Similar News
News April 25, 2025
విశాఖలో చంద్రమోలి అంతిమ యాత్ర

పహల్గాంలో ఉగ్రమూకల కాల్పుల్లో మరణించిన చంద్రమోలి అంతిమ యాత్ర విశాఖలో ప్రారంభమైంది. పాండురంగాపురంలో ఆయన పార్థివదేహానికి మంత్రులు అనిత, సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నివాళులు అర్పించి పాడె మోశారు. జ్ఞానాపురం శ్శశాన వాటికలో ఆయన దహన సంస్కణలు పూర్త చేయనున్నారు.
News April 25, 2025
విశాఖ జూలో వేసవి తాపానికి చెక్

వేసవికాలం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల వేసవితాపం జూక్యూరేటర్ మంగమ్మ, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రకాల జంతువుల వద్ద వాటర్ స్పింక్లర్లు ఏర్పాటు చేయడం, సాదు జంతువులకు వాటర్ స్ప్రే చేయడం, కొన్ని రకాల పక్షులకు, జంతువులకు ఎయిర్ కండిషన్స్ ఏర్పాటు చేయడం వంటి సదుపాయాలు కల్పించారు.అదేవిధంగా వాటర్ మిలన్, కర్బూజా వంటి చల్లని పదార్థాలు అందజేస్తారు.
News April 25, 2025
విశాఖలో నేడు చంద్రమౌళి అంత్యక్రియలు

కశ్మీర్ ఉగ్రవాద దుర్ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు విశాఖలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి మృతదేహానికి గురువారం రాత్రి ఘన నివాళులర్పించారు.