News April 11, 2025

రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: CP

image

సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధను సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి క్రిస్టోఫర్ పురుషోత్తమ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Similar News

News April 20, 2025

బోధన్ డంపింగ్ యార్డ్‌ అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ ఆరా

image

బోధన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. మంటలను అదుపు చేసి, వీలైనంత త్వరగా ఆర్పడానికి తక్షణ అవసరమైన చర్యలు, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్‌తో వెంకట నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

News April 20, 2025

నెల్లూరు: హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

image

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఆదివారం బుల్లెట్ వాహనంపై పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ధనలక్ష్మిపురం, నారాయణ మెడికల్ కాలేజ్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి శానిటేషన్ సెక్రటరీలకు సూచనలు చేశారు. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆదివారం కూడా పనికి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఆదేశించారు.

News April 20, 2025

పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క

image

ఉట్నూర్ మండలం దేవుగూడ ప్రభుత్వ గిరిజన టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలో ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క శిశు బెంచెస్ అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పాల్గొన్నారు.

error: Content is protected !!