News August 14, 2024

రోడ్డు భద్రత చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించిన సీపీ

image

కరీంనగర్ ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై పలు శాఖల అధికారులతో కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌లోని ట్రాఫిక్ నియంత్రణ కొరకు ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్నారు. సీసీ కెమెరాలను సంఖ్యను పెంచి వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన చోట్ల మాత్రమే యూ టర్న్‌ల ఏర్పాటు చేయాలని తెలిపారు.

Similar News

News November 20, 2025

రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొన్నం

image

కరీంనగర్ జిల్లాలో రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎల్ఎండీ కాలనీ వద్ద చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లోని సారధి కళామందిర్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు.

News November 20, 2025

హనుమాన్ నగర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

కరీంనగర్‌లోని హనుమాన్ నగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మేస్త్రీ పని చేసుకుంటూ కొంతకాలంగా ఒంటరిగా కిరాయి ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 20, 2025

KNR: మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ పమోల సత్పతి సమావేశమయ్యారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు, కృషి, పట్టుదలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.