News February 1, 2025
రోడ్డు భద్రత మనందరి బాధ్యత: భద్రాద్రి కలెక్టర్

రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
SRPT: ‘సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలి’

సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మిల్లర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సీఎంఆర్ గడువును NOV 12 వరకు పొడిగించిందని, మిల్లర్లు అందరూ సహకరించి గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. మిల్లులను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సీఎంఆర్ పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.
News September 18, 2025
ఆసియా కప్: UAE టార్గెట్ 147 రన్స్

ఆసియా కప్లో భాగంగా UAEతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోర్ చేసింది. ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో షహీన్ ఆఫ్రిది (29*) బౌండరీలతో స్కోర్ బోర్డును పెంచారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రాన్జీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే యూఏఈ 20 ఓవర్లలో 147 రన్స్ చేయాలి. UAE గెలుస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.
News September 18, 2025
ఇల్లంతకుంట: ఉపాధ్యాయుడిలా మారిన కలెక్టర్

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయుడిలా మారారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట మోడల్ స్కూలును బుధవారం ఆయన తనిఖీ చేశారు. కాసేపు ఉపాధ్యాయుడిలా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను విద్యార్థులతో నిత్యం చదివించి రాయించాలన్నారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠ్యాంశాలపై పట్టు వచ్చేలా పిల్లలకు బోధించాలన్నారు.