News February 1, 2025
రోడ్డు భద్రత మనందరి బాధ్యత: భద్రాద్రి కలెక్టర్

రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
సంగారెడ్డి: ముగ్గులతో రామానుజన్ చిత్రం.. విద్యార్థినుల ప్రతిభ

జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటాన్ని రంగురంగుల ముగ్గులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలికల సృజనాత్మకతను జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సునీత కన్నా ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంచాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.
News December 22, 2025
తిరుపతి జిల్లాలో SIల బదిలీ

తిరుపతి జిల్లాలో 18మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు ఉత్తర్వులు ఇచ్చారు.
స్వాతి: అలిపిరి TO శ్రీకాళహస్తి వన్ టౌన్
జగన్నాథరెడ్డి: తిరుచానూరు TO మహిళా పీఎస్
సాయినాథ చౌదరి: సీసీఎస్ TO సత్యవేడు
వెంకటరమణ: తొట్టంబేడు TO తిరుమల టూ టౌన్
చిత్రి తరుణ్: శ్రీసిటీ TO పాకాల
తలారి ఓబయ్య: డీసీఆర్బీ TO కేవీబీపురం
మరికొందరి వివరాల కోసం ఇక్కడ<<18637111>> క్లిక్<<>> చేయండి.
News December 22, 2025
నల్గొండ: పశువుల ఆస్పత్రిలోనే పంచాయతీ పాలన!

నిడమనూరు మండలంలోని పలు జీపీలకు సొంత భవనాలు లేక పాలన అద్దె గదుల్లోనే సాగుతోంది. నిడమనూరు మేజర్ పంచాయతీ భవన నిర్మాణం 11 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉండటంతో, ప్రస్తుతం పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిధులు విడుదల చేసి సొంత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


