News February 1, 2025
రోడ్డు భద్రత మనందరి బాధ్యత: భద్రాద్రి కలెక్టర్

రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2025
IPL 2025: సీఎస్కే తొలి మ్యాచ్ ఎవరితో అంటే?

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడనున్నట్లు Espn Cricinfo పేర్కొంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచులో ఐదేసి సార్లు కప్పు గెలిచిన ఈ జట్లు పోటీపడతాయని తెలిపింది. కాగా ఆర్సీబీ VS కేకేఆర్ (ఈడెన్ గార్డెన్లో), SRH vs RR (HYDలో) తమ తొలి మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని చెప్పింది.
News February 16, 2025
ASF: కేంద్రం నుంచి రూ.3 కోట్లు మంజూరు

ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా చేపట్టవలసిన పనుల అంచనాలతో వెంటనే నివేదిక రూపొందించి సమర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా చేపట్టవలసిన అభివృద్ధి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 3 కోట్ల నిధులతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు.
News February 16, 2025
NRML: రాష్ట్రాలు దాటొచ్చిన ఎడారి ఓడ

రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఓ కుటుంబం తమ బతుకుదెరువు కోసం ఒంటెలను తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా నుంచి బాసరకు నాలుగు ఒంటెలను తీసుకొని వచ్చారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు కొంతమంది ఒంటెలను చూసి ఎంత బాగున్నాయంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచి వస్తున్నారని వారిని కొందరు పలకరించగా రాజస్థాన్ నుంచి పొట్టకూటి కోసం, ఒంటెల మేత కోసం ఇక్కడికి వచ్చినట్లు ఒంటెల కాపర్లు తెలిపారు.