News March 4, 2025
రౌండ్లవారీగా MLC అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవే.!

MLC ఎన్నికల్లో 5 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవే. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రకి మొదటి రౌండ్-17194, రెండవ రౌండ్ -17527, మూడవ రౌండ్-16723, నాలుగో రౌండ్-16236, ఐదో రౌండ్-16,916 ఓట్లు చొప్పున వచ్చాయి. మరోవైపు PDF అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావుకు మొదటి రౌండ్-7214, రెండవ రౌండ్-6742, మూడవ రౌండ్-7404, నాలుగో రౌండ్-7828, ఐదో రౌండ్-7535 చొప్పున ఓట్లు రాగా..47872 ఓట్లతో ఆలపాటి గెలిచారు.
Similar News
News November 27, 2025
మహబూబాబాద్లో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనులు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ దగ్గర నుంచి కేశంపురం వెళ్లేదారి వెడల్పు, సుందరరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రోడ్డు వెడల్పు పనులు పూర్తయి రోడ్డు మధ్యలో డివైడర్ను కూడా నిర్మించగా, ఇప్పుడు వెడల్పు చేసిన రహదారిని తారు రోడ్డుగా మార్చే పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. వాహనదారులు కొంతమేరకు ఇబ్బంది పడినప్పటికీ శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.
News November 27, 2025
SKLM: జిల్లాకు చేరుకున్న శాసనసభ అంచనాల కమిటీ అధికారులు

ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ అధికారులు గురువారం శ్రీకాకుళం చేరుకున్నారు. ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి కే.సాయిప్రత్యూష, DSP వివేకానంద, DRDA PD కిరణ్ కుమార్ ఇతర అధికారులు అధికారులు ఘన స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు వివి సూర్యనారాయణరాజు, వరుదు కళ్యాణి అధికారులు ఉన్నారు.


