News March 22, 2025
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ MLA

హైదరాబాద్లోని FTCCIలో ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో శుక్రవారం బడ్జెట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిర్పూర్ MLA డా.పాల్వాయి హరీశ్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో అనేక కాకి లెక్కలు చెప్పిందని ఆరోపించారు. బడ్జెట్ మీద చూపిస్తున్న అంకెలకు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. కార్యక్రమంలో సాయిప్రసాద్, శ్రీనివాస్ తదితరులున్నారు.
Similar News
News April 22, 2025
తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.
News April 22, 2025
కడప జిల్లాలో ఎస్ఐల బదిలీ

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిపాదనల మేరకు 10 మందికి స్థానచలనం కల్పించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
News April 22, 2025
అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ దరఖాస్తుల గడువు పొడిగింపు

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ దరఖాస్తుల గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం పేర్కొన్నారు. భారత రక్షణ శాఖ వివిధ దళాల రిక్రూట్మెంట్లో నూతనంగా ప్రవేశపెట్టిన అగ్ని పథకంలో భాగంగా ఆర్మీలో ఉద్యోగాల ప్రకటన జారీ అయినదని అన్నారు. మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని కేవలం ప్రతిభ, మార్కుల ఆధారంగానే నియామకాలు జరుగుతాయన్నారు.