News April 3, 2025

ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నారా: ASF SP

image

మహిళలు చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం ద్వారా అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలపై ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పాల్పడినా.. హింసలకు గురైతే జిల్లా షీ టీం లేదా భరోసా సెంటర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News October 24, 2025

అరుణాచాలానికి ప్రత్యేక యాత్ర బస్సు ఏర్పాటు: మంథని RTC DM

image

అరుణాచల గిరి ప్రదక్షిణ వీక్షణకు మంథని డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడిపించనున్నట్లు డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. నవంబర్ 3 సోమవారం సాయంత్రం మంథని బస్టాండ్ నుంచి బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్ మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, అలంపూర్ జోగులాంబ దర్శనాలు ఉంటాయన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ.5,040, పిల్లలకు రూ.3,790. మరిన్ని వివరాలకు 9959225923, 9948671514 నంబర్లను సంప్రదించవచ్చు.

News October 24, 2025

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు ప్రతిపాదనలు: డీఆర్‌ఓ

image

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుందని డీఆర్‌ఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి నివేదికను ఎన్నికల సంఘానికి అందించామన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని ఆ వివరాలను అందించాలని కోరారు.

News October 24, 2025

PDPL: జిల్లా పంచాయతీ అధికారి సమీక్షా సమావేశం

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. పన్నుల వసూళ్లు, శుభ్రత, ప్రజా సేవలు, హౌసింగ్ పథకాలు వంటి అంశాలపై చర్చించారు. గ్రామాల్లో శుభ్రత, వందశాతం పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. నిర్లక్ష్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.