News April 3, 2025
ర్యాగింగ్, ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్నారా: ASF SP

మహిళలు చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం ద్వారా అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలపై ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పాల్పడినా.. హింసలకు గురైతే జిల్లా షీ టీం లేదా భరోసా సెంటర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 24, 2025
ఐబొమ్మ రవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే?

TG: ఐబొమ్మ రవి రాబిన్హుడ్ హీరో అని ప్రజలు అనుకుంటున్నారని జడ్చర్ల MLA అనిరుధ్ అన్నారు. టికెట్ ధరలు పెంచి దోచుకోవడం తప్పనే భావనలో వారు ఉన్నారని తెలిపారు. ‘₹1000 కోట్లు పెట్టి తీస్తే బాగుపడేది హీరో, డైరెక్టర్, నిర్మాత అని, ₹50-100Cr పెట్టి తీయలేరా అని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలని మరికొందరు అంటున్నారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి’ అని చెప్పారు.
News November 24, 2025
ADB: రిజర్వేషన్ల ప్రక్రియ పునఃపరిశీలన

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదిక, బీసీ డిక్లరేషన్ కమిషన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని పునఃపరిశీలించినట్టు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వారి జనాభాకన్నా తక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదని, అదే సమయంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేశారు.
News November 24, 2025
కామారెడ్డి జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీ

పరిపాలనా కారణాల దృష్ట్యా కామారెడ్డి జిల్లాలోని నలుగురు SIలను వేరే పోలీస్ స్టేషన్లకు అటాచ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం మెమోరాండం జారీ చేసింది. కె.విజయ్ను మద్నూర్ నుంచి బిబిపేట్కు, ఎం.ప్రభాకర్ను బిబిపేట్ నుంచి దోమకొండకు, డి.స్రవంతిని దోమకొండ నుంచి కామారెడ్డి టౌన్కు జి.రాజును (వెయిటింగ్ రిజర్వ్) నుంచి మద్నూర్ పీఎస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


