News February 4, 2025

లంగడీ పోటీల్లో చోద్యం విద్యార్థుల ప్రతిభ

image

ఇటీవల తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి లంగడీ ఆటల పోటీల్లో గొలుగొండ మండలం చోద్యం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 11 మంది ఈ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని హెచ్ఎం శ్రీనివాసరావు, పీఈటీ నూకరాజు తెలిపారు. మన రాష్ట్రంలో ప్రాచుర్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో పోటీ పడి గెలుపొందారని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News April 11, 2026

సీజ్‌ఫైర్.. బియ్యం ధరలకు రెక్కలు!

image

పశ్చిమాసియాలో శాంతి చర్చలు బియ్యం ధరలకు రెక్కలు తెచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్‌తో అరబ్ దేశాల నుంచి ఎక్స్‌పోర్ట్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత 2 రోజుల్లోనే బియ్యం హోల్ సేల్ ధరలు 7% పెరిగాయి. ముంద్రా, కాండ్లా పోర్టుల ద్వారా సోమవారం నుంచి భారీగా ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే 15 రోజుల్లో రిటైల్ మార్కెట్లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

News April 11, 2026

శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని శనివారం రోజున నైవేద్యంగా పెడితే..?

image

శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదమంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. శనివారం ఆయనకు అటుకులు, అన్నం, బెల్లం, కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగి, ఇంట్లో ధనవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని ఆయనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచితే.. సంకటాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు సుగుణాల భర్త వస్తాడని నమ్మకం.

News April 11, 2026

గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

image

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం.