News February 18, 2025
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అటవీ అధికారులు

ఇల్లందు మండలం కొమరారం అటవీ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ అధికారి నునావత్ హరిలాల్ పట్టుబడ్డారు. అటవీ భూమి నుంచి గ్రావెల్ తరలించేందుకు ఓ వ్యక్తిని రూ. 30 వేలు డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
Similar News
News December 9, 2025
శ్రీకాకుళం: రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి కోసం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఎచ్చెర్లలో శివాని, వెంకటేశ్వర కళాశాలలు, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీ, టెక్కలి ఐతమ్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
News December 9, 2025
వాయువేగంతో ‘గ్రేటెస్ట్ హైదరాబాద్’.. స్పష్టత ఏది?

GHMCలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల <<18508761>>విలీనం<<>> వాయువేగంతో పూర్తైంది. 150 డివిజన్లతో ఉన్న GHMC.. 27 ULBs కలిశాక 12 జోన్లు, 300డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో (నం.266) విడుదల చేసింది. పెరుగుతున్న నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు డబుల్ చేయాలని కమిషనర్ పంపిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే..మమ్మల్ని GHMCలో ఎందుకు కలిపారో చెప్పడంలేదెందుకని శివారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News December 9, 2025
వన్డే క్రికెట్ టోర్నీలో కర్నూలు జిల్లా వాసి

ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు BCCI ఆధ్వర్యంలో ముంబైలో జరగనునున్న అండర్-19 ఉమెన్స్ వన్డే టోర్నీకి కర్నూలు జిల్లా వెల్దుర్తి(M) ఎల్.బండకు చెందిన కౌసల్య బాయి ఎంపికైంది. కర్నూలు క్రికెట్ ఆసోషియేషన్ శిక్షకుడు శ్రీనివాసులు ఫీల్డింగ్ కోచ్గా ఎంపికయ్యారు. కౌసల్య ప్రస్తుతం కర్నూలులో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.


