News February 18, 2025
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అటవీ అధికారులు

ఇల్లందు మండలం కొమరారం అటవీ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ అధికారి నునావత్ హరిలాల్ పట్టుబడ్డారు. అటవీ భూమి నుంచి గ్రావెల్ తరలించేందుకు ఓ వ్యక్తిని రూ. 30 వేలు డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
Similar News
News January 5, 2026
హ్యాపీ హార్మోన్స్ కోసం ఇలా చేయాలి

ఎమోషన్స్ బావుండటానికి, రోజంతా హ్యాపీగా ఉండటానికి శరీరంలో సెరటోనిన్ హార్మోన్ సరిపడినంత ఉండటం ముఖ్యం. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. పీచు పదార్థాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం, రోజూ ఎండలో కాసేపు ఉండటం, ధ్యానం చేయడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.. ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో సెరటోనిన్గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ ఫిష్లో ఎక్కువగా ఉంటుంది.
News January 5, 2026
ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా.. జేఎన్యూ స్టడీ

ఢిల్లీ గాలిలో ప్రమాదకర స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియాను గుర్తించారు. యాంటీబయాటిక్స్కు కూడా లొంగని ఈ సూపర్బగ్ ఉన్నట్టు జేఎన్యూ స్టడీలో వెల్లడైంది. దేశ రాజధానిలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాలు, హాస్పిటల్స్ పరిసరాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. న్యుమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు ఈ బగ్ కారణమవుతుందని తెలిపింది. WHO పరిమితికి మించి గాలిలో 16 రెట్లు అధికంగా బ్యాక్టీరియా వ్యాపించినట్టు తెలిపింది.
News January 5, 2026
కర్నూలు: పోలీస్ పీజీఆర్ఎస్కు 84 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు స్వీకరించారు. మోసాలు, చీటింగ్, పంట దోపిడీ తదితర అంశాలపై పోలీసు అధికారులు తక్షణ స్పందించాలని ఆదేశించారు.


