News March 25, 2025
లంచం తీసుకుంటూ పట్టుపడ్డ పిఠాపురం రూరల్ ఎస్సై

పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దొంతలూరు గ్రామానికి సంబంధించిన కేసు విషయంలో లంచం అడిగినట్లు ఏసీబీకి ముందస్తు సమాచారం అందింది. దీంతో నిఘా ఉంచిన అధికారులు రూ.20వేలు తీసుకుంటుండగా.. అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News November 1, 2025
UPDATE: ఘటనా స్థలాన్ని పరిశీలించిన NZB CP

నవీపేట్ మండలం ఫకీరాబాద్ -మిట్టాపల్లి రహదారిలో ఓ మహిళను <<18166463>>వివస్త్రగా చేసి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.<<>> విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్తో పరిశీలన చేయించారు. నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో ఇది రెండవ హత్య కావడం గమనార్హం.
News November 1, 2025
సిరిసిల్ల: బ్రిడ్జిపై నుంచి దూకిన వ్యక్తి మృతదేహం లభ్యం

సిరిసిల్ల బ్రిడ్జిపై నుంచి మానేరు వాగులోకి దూకి గల్లంతైన సల్లంగుల కృష్ణయ్య(55) మృతదేహం శనివారం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కాగా, గురువారం సాయంత్రం బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకిన కృష్ణయ్య గల్లంతయ్యాడు. గురువారం నుంచి ఇప్పటివరకు పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు ఉదయం అతని మృతదేహం లభ్యమైంది.
News November 1, 2025
ఇవాళ్టి నుంచి శుభకార్యాలు ప్రారంభం!

నేడు కార్తీక శుక్ల ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజునే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుంచి మేల్కొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో చాతుర్మాసం ముగిసి నేటి నుంచి పెళ్లిళ్లు సహా అన్ని రకాల శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. భక్తులు ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని పూజిస్తూ, సాయంత్రం తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ ఏకాదశి సర్వపాపాలను తొలగిస్తుందని నమ్మకం.


