News March 30, 2025

లంచం తీసుకున్న పిఠాపురం ఎస్‌ఐ సస్పెండ్

image

ఇటీవల పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దొంతమూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల దగ్గర లంచం తీసుకున్న పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్‌ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 24న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ SI గుణశేఖర్‌ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యం శనివారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News November 1, 2025

పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 1, 2025

పెద్దపల్లి: ప్రమాదాలకు నిలువుగా రాజీవ్ రహదారి

image

PDPL పట్టణంలోని రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్లు లేక ప్రమాదాలకు నిలువుగా మారింది. గురువారం ఉదయం బంధంపల్లి శాంతినగర్‌కు చెందిన పెంజర్ల లక్ష్మీనారాయణ (35) పాలు అమ్మడానికి వెళ్తుండగా బస్టాండ్ సిగ్నల్ వద్ద గోదావరిఖని వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతనిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 1, 2025

6.30 నుంచే పెన్షన్ల పంపిణీ: తిరుపతి కలెక్టర్

image

తిరుపతి జిల్లాలో శనివారం ఉదయం 6.30కే పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం 7గంటలకు 100 శాతం సిబ్బంది పింఛన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పునః పరిశీలనలో అనర్హులుగా గుర్తించిన పింఛనుదారులు, అప్పీలు చేసుకోని వారికి కూడా ఈనెల పింఛన్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వారికీ సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేయాలన్నారు.