News March 20, 2025
లక్షటిపేట: చేపల వేట.. మత్స్యకారుడి మృతి

లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి లింగయ్య 65 మత్స్యకారుడు మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. మృతుడు చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే చేపల వేటకు గోదావరికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఒడ్డున చనిపోయి ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 6, 2025
జూబ్లీ సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర: చనగాని దయాకర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేటీఆర్ వెనుక ఉండి చేయిస్తున్న ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయం మారదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ.. ఫేక్ సర్వేలు పూర్తి ప్రజా అభిప్రాయం కాదన్నారు. సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర ముమ్మాటికి ఉందని అందుకే సర్వేల ఆర్టిస్టులు బయటకు వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ముమ్మాటికి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.
News November 6, 2025
జగిత్యాల: రాయికల్లో కానిస్టేబుల్పై దాడికి యత్నం

రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన దొంతి సాయి(23), గంజాయి కేసులో పరారీలో ఉండగా రాయికల్ బస్టాండ్ వద్ద కానిస్టేబుల్ వెంకటేశ్ అతడిని పట్టుకున్నాడు. స్టేషన్కు తీసుకెళ్తుండగా సాయి బండిని వేగంగా నడుపుతూ కానిస్టేబుల్ను కిందపడేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. గాయాలతోనూ అతడిని తిరిగి పట్టుకున్నాడు. ఈ సమయంలో సాయి తండ్రి మురళి, అన్న నాగరాజు అడ్డుపడడంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
News November 6, 2025
దురుద్దేశంతోనే నాపై స్టాలిన్ ఆరోపణలు: విజయ్

కరూర్(TN) తొక్కిసలాటపై CM స్టాలిన్ అసెంబ్లీలో తనపై ద్వేషంతోనే ఆరోపణలు చేశారని TVK చీఫ్ విజయ్ విమర్శించారు. బాధితుల్ని ఆదుకున్నా రాజకీయ, ప్రభుత్వ, మీడియా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దీంతోనే నిష్పాక్షిక విచారణ జరగదని సుప్రీం గుర్తించిందని చెప్పారు. ఎన్నికల్లో DMK, TVK మధ్యే పోటీ అని స్పష్టంచేశారు. తొక్కిసలాట తర్వాత తొలిసారి భేటీ అయిన TVK కౌన్సిల్ CM అభ్యర్థిగా విజయ్ను డిక్లేర్ చేసింది.


