News March 20, 2025

లక్షటిపేట: చేపల వేట.. మత్స్యకారుడి మృతి

image

లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి లింగయ్య 65 మత్స్యకారుడు మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. మృతుడు చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే చేపల వేటకు గోదావరికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఒడ్డున చనిపోయి ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 9, 2025

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. Sensex 46 పాయింట్ల లాభంతో 83,665 పాయింట్ల వద్ద,, Nifty 10 పాయింట్ల నష్టంతో 25,512 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, JSW స్టీల్, ICICI, HDFC, టెక్ మహీంద్రా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో షేర్లు నష్టాల్లో, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, మారుతీ సుజుకీ, M&M, సిప్లా, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

News July 9, 2025

హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు: ఎస్పీ

image

మందస పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన హత్యాయత్నం, గృహహింస కేసులో నిందితుడికి 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మందసకు చెందిన సూర్యారావు తన భార్య నిర్మలపై హత్యాయత్నం చేశాడు. నేరం రుజువైనందున అసిస్టెంట్ సెషన్ సోంపేట కోర్టు జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.

News July 9, 2025

JGTL: రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన యువతి

image

ICET-2025 ఫలితాల్లో మొత్తం 58,985 మంది ఉత్తీర్ణత సాధించగా మేడిపల్లి(M) కొండాపూర్(V)కి చెందిన వీరేశం, విజయలక్ష్మి కుమార్తె వైష్ణవి(22) రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. టాప్10లో ఇద్దరే అమ్మాయిలు ఉండగా అందులో మన మండలవాసి వైష్ణవి 5వ ర్యాంకు కొట్టింది. కాగా, ఈమె గతంలో <<16285740>>5బ్యాంకు ఉద్యోగాలు<<>> సాధించి అందరితో శెభాష్ అనిపించుకుంది. వైష్ణవి విజయాల పట్ల పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు.