News February 16, 2025

లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News October 27, 2025

వారి ఓట్లు తొలగిస్తాం: CEC

image

SIR రెండో దశ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు CEC జ్ఞానేశ్ ప్రకటించారు. Goa, గుజరాత్, కేరళ, MP, రాజస్థాన్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, UP, WB, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు, ఉపఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటర్ లిస్ట్‌ను సీజ్ చేస్తామని తెలిపారు. మరణించిన, వలస వెళ్లిన, ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న ఓట్లను తొలగిస్తామన్నారు.

News October 27, 2025

జూబ్లీహిల్స్ ప్రచారానికి CM.. షెడ్యూల్ ఇదే

image

TG: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. అక్టోబర్ 31న వెంగళరావు నగర్, సోమాజీగూడ, నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడ, 8, 9న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో రాత్రి 7 గంటల నుంచి ప్రచారం చేయనున్నారు.

News October 27, 2025

గుంటూరు జిల్లా నిరుద్యోగులకు ముఖ్య గమనిక

image

జర్మనీలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల కోసం మైనారిటీ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ, ఓఎంసీఏపీ, ఐఈఎస్‌ సంయుక్తంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం, వయస్సు 30 లోపు ఉండాలని అధికారులు తెలిపారు. మొత్తం ఖర్చు రూ.1.15 లక్షలు 3 వాయిదాల్లో చెల్లించాలి. ఆసక్తిగల వారు నవంబర్ 2లోపు naipunuam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.