News February 20, 2025

లక్షెట్టిపేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

లక్షెట్టిపేట మండలం హనుమంతుపల్లికి చెందిన నస్పూరి గౌరయ్య(49) స్లాబ్ రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సతీశ్ తెలిపారు. గౌరయ్య ముంబైలో కూలి పనిచేసి సంవత్సరం క్రితం గ్రామానికి వచ్చి కూతురు పెళ్లి చేసి ఇల్లు కట్టుకున్నాడు. వాటికోసం సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడన్నారు. అప్పులు తీర్చడం భారమై గౌరయ్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News February 24, 2026

భాగ్యనగరంలో భారీ వర్షం.. రాబోయే కొన్ని గంటలు అలర్ట్!

image

HYDలో అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్‌బాగ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో GHMC వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉండొచ్చని మ్యాప్ విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి చీకట్లు అలముకొన్నాయి.

News February 24, 2026

మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే..

image

శివునికి అంకితం చేసిన ఈ మంత్రం అతి శక్తిమంతమైనది. దీనిని ‘మృత్యువును జయించే మంత్రం’ అంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అకాల మృత్యు భయం పోవడానికి, త్వరగా కోలుకోవడానికి, శివుని రక్షణ పొందడానికి దీనిని పఠిస్తుంటారు.
మంత్రం: ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్| ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్||

News February 24, 2026

30 లక్షల ఇళ్లపై సోలార్ వెలుగులు

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘PM సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అద్భుతమైన స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30 లక్షల గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఘనతపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్ ఇంధన భద్రత, స్వయం సమృద్ధి దిశగా వేసిన కీలక అడుగు అని కొనియాడారు.